వేగులం కాదు.. ప్రజా సేవకులం

Volunteers across Andhra Pradesh are angry on Eenadu - Sakshi

‘ఈనాడు’పై రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్ల ఆగ్రహం

రామోజీ దిష్టిబొమ్మ, ఆ పత్రిక ప్రతుల దహనం

తమకు రాజకీయ మకిలి అంటించొద్దని ఆగ్రహం

కుల మతాలకు అతీతంగా పని చేస్తున్నామని వెల్లడి

సాక్షి ప్రతినిధి, విజయనగరం/కోటబొ­మ్మాళి/­మదనపల్లె: ఈనాడు దినపత్రికలో ప్రచు­రిం­చిన­ట్లు­గా తాము వేగులం కాదని, ప్రజలకు సేవలంది­స్తున్న సేవకులమని గ్రామ, వార్డు వలంటీర్లు స్ప­ష్టం చేశారు. వలంటీర్ల వ్యవస్థపై ప్రజల్లో అపో­హ­లు పెంచేలా అవాస్తవ కథనాలు రాయడం దారు­ణం అని మండిపడ్డారు. బుధవారం విజయ­నగరం జిల్లా చీపురుపల్లి, లక్కవరపుకోట, రాజాం, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీ­పురం, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, సారవకోట, పాతపట్నం, అన్నమయ్య జిల్లా మదన­పల్లెలో నిరసనలు, మానవ హారాలు నిర్వ­హించారు.

భారీ సంఖ్యలో వలంటీర్లు తరలి వచ్చి నిరసన తెలి­పా­రు. వేగులమంటూ తమ మనోభా­వాలు దెబ్బ­తీసేలా ఈనాడు దారుణంగా దుష్ప్రచా­రం చేయ­డం తగదని ధ్వజమెత్తారు. రామోజీరావు క్షమాపణ చెప్పా­లని డిమాండ్‌ చేశారు. తప్పుడు కథనాలకు నిరసనగా రామోజీ దిష్టిబొమ్మను, ఈనాడు ప్రతులను దహనం చేశారు.

మదనపల్లెలో వలంటీర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉదయ్‌­కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నీరుగట్టి రాజేష్‌ మాట్లాడుతూ.. రాజకీయ కారణాలతో వలంటీర్‌ వ్యవస్థ గురించి తప్పుగా రాస్తే ప్రజలు నిజమని నమ్మేస్తారనుకోవడం రామో­జీ భ్రమ అన్నారు.

వలంటీర్‌ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడం వల్లే నేడు నూరు శాతం ప్రభుత్వ పథకాలు అర్హు­లకు చేరుతున్నాయని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాలు, యూనిసెఫ్‌ ఈ వ్యవస్థపై ప్రశంసలు వ్యక్తం చేయడం కనిపించలేదా.. అని నిలదీశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top