‘స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులను తొలగిస్తుంటే పల్లా చేస్తున్నారు?’ | Vizag Steel Plant Contract Employees Protest, Demanding To Reinstate Dismissed Employees | Sakshi
Sakshi News home page

‘స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులను తొలగిస్తుంటే పల్లా చేస్తున్నారు?’

Published Sun, Mar 23 2025 11:20 AM | Last Updated on Sun, Mar 23 2025 11:36 AM

Vizag Steel Plant Contract Employees Protest

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు నేడు పాదయాత్రకు పిలుపునిచ్చారు. తొలగించిన ఉ‍ద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కొత్త గాజువాక జంక్షన్‌ నుంచి కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వరకు నిరసన చేపట్టనున్నారు.

కాంట్రాక్ట్‌ కార్మికుల పాదయాత్ర నేపథ్యంలో ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు స్పందించారు. ఈ సందర్బంగా నరసింగరావు మాట్లాడుతూ..‘కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రైవేటీకరణలో భాగం. కార్మికులు లేకుండా ప్లాంట్‌ను ఎలా నడుపుతారు. ఒక్క కార్మికుడిని కూడా తొలగించకుండా పోరాడుతాం. స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్లాంట్ కార్మికులతో అవసరం తీరిపోయింది. ఇంత మందిని తొలగిస్తుంటే పల్లా శ్రీనివాస్ ఎందుకు మాట్లాడటం లేదు?. స్థానిక ప్రజా ప్రతినిధులు నిద్రపోతున్నారు. పోరాటంతోనే కార్మికుల హక్కులను సాధిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement