breaking news
contract employe
-
పెళ్లి రద్దు.. కాంట్రాక్టు ఉద్యోగిని ఆత్మహత్య
కర్ణాటక రాష్ట్రం: ఇటీవలే నిశ్చితార్థం జరిగింది, త్వరలో పెళ్లయి సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతి.. ప్రాణాలు తీసుకుంది. పెళ్లి రద్దు కావడమే దీనికి కారణం. మండ్య జిల్లాలోని కేఆర్పేటె తాలూకాలోని కిక్కేరిలో ఈ విషాదం జరిగింది. వివరాలు.. స్థానిక వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిని కావ్య (28)కు, 15 రోజుల క్రితం హాసన్కు చెందిన కరణ్ అనే యువకునితో పెద్దలు నిశి్చతార్థం జరిపించారు.కరణ్ డిగ్రీ పూర్తి చేసి ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు. యువతి కుటుంబీకుల పరిశీలనలో ఇది అబద్ధమని తేలింది. దాంతో పనీపాటా లేని వ్యక్తితో పెళ్లి వద్దని కావ్య తండ్రి తేలి్చచెప్పాడు. మరోవైపు పెళ్లి ఖరారైందని స్నేహితులకు, సహోద్యోగులకు చెప్పుకొన్న కావ్య ఈ పరిణామంతో విరక్తి చెందింది, 4వ తేదీన కిక్కేరిలో వ్యవసాయ ఆఫీసులో పురుగుల మందు తాగిపడిపోయింది. సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసి బిజీఎస్ ఆస్పత్రికి తరలించగా ఆమె శనివారం కన్నుమూసింది. పెళ్లి వాయిద్యాలు మోగాల్సిన ఇంట విషాదం తాండవించింది. -
‘స్టీల్ప్లాంట్లో కార్మికులను తొలగిస్తుంటే పల్లా చేస్తున్నారు?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టీల్ప్లాంట్ కార్మికులు నేడు పాదయాత్రకు పిలుపునిచ్చారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్త గాజువాక జంక్షన్ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ప్లాంట్ ఆర్చ్ వరకు నిరసన చేపట్టనున్నారు.కాంట్రాక్ట్ కార్మికుల పాదయాత్ర నేపథ్యంలో ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు స్పందించారు. ఈ సందర్బంగా నరసింగరావు మాట్లాడుతూ..‘కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రైవేటీకరణలో భాగం. కార్మికులు లేకుండా ప్లాంట్ను ఎలా నడుపుతారు. ఒక్క కార్మికుడిని కూడా తొలగించకుండా పోరాడుతాం. స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్లాంట్ కార్మికులతో అవసరం తీరిపోయింది. ఇంత మందిని తొలగిస్తుంటే పల్లా శ్రీనివాస్ ఎందుకు మాట్లాడటం లేదు?. స్థానిక ప్రజా ప్రతినిధులు నిద్రపోతున్నారు. పోరాటంతోనే కార్మికుల హక్కులను సాధిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
వైఎస్ జగన్ను కలిసిన వైద్యఆరోగ్యశఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
కర్నూలు : నిర్లక్ష్యంతో డ్రైవర్ బస్ నడపడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూల జిల్లా నందికొట్కూరు ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం జరిగింది. వివరాలు... ఆర్టీసీ డ్రైవర్ బస్ను రీవర్స్ తీస్తుండగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కిషోర్(20) అనే వ్యక్తి తలపై వెళ్లడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.