మానసిక ఆరోగ్య సంరక్షణలో ఏపీ భేష్‌ | Union Health Department Appreciates State Govt Policies: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మానసిక ఆరోగ్య సంరక్షణలో ఏపీ భేష్‌

Feb 20 2024 3:47 AM | Updated on Feb 20 2024 3:47 AM

Union Health Department Appreciates State Govt Policies: Andhra Pradesh - Sakshi

నేషనల్‌ మెంటల్‌ వర్క్‌షాప్‌లో రాష్ట్రానికి ఇచి్చన మెమెంటోతో ఎస్‌ఎంహెచ్‌ఏ సీఈవో డీఎంఈ నరసింహం, ప్రత్యేకాధికారి డాక్టర్‌ నీలిమ 

సాక్షి, అమరావతి: ప్రజల మానసిక ఆరోగ్య సంరక్షణకు ఏపీ ప్రభు­త్వం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉంటున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రశంసించింది. దేశంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలందించడం, వారి హక్కులను కాపాడటమే లక్ష్యంగా మానసిక ఆరోగ్య సం­రక్షణ చట్టాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చట్టం అమలుపై రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలిచ్చింది. కాగా, చట్టం అమల్లో భాగంగా సీఎం జగన్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ వర్క్‌షాప్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ కితాబిచ్చింది. మన రాష్ట్రం అవలంభిస్తున్న విధానాలను త్వరలో ప్రత్యేకంగా తెలుసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్‌ సెక్రటరీ ఎల్‌ఎస్‌ ఛాంగ్సన్‌ పేర్కొన్నారు.

ప్రత్యేక బోర్డ్‌ల ఏర్పాటు
మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అమల్లో భాగంగా ప్రభు­త్వం ఇప్పటికే స్టేట్‌ మెంటల్‌ హెల్త్‌ అథారిటీ(ఎస్‌ఎంహెచ్‌ఏ)తో పా­టు, విశాఖపట్నం, ఎన్టీఆర్, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో రీజిన­ల్‌ రివ్యూ బోర్డ్‌ల ఏర్పాటును చేపట్టింది. ఎస్‌ఎంహెచ్‌ఏలో రాష్ట్రంలో మానసిక రోగులకు చికిత్సలు అందించేలా ఆస్పత్రుల రిజి్రస్టేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకూ 52 మెంటల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూషన్‌లు రిజిస్ట్రర్‌ చేసుకున్నాయి. మరోవైపు మా­న­సిక స్థితి సరిగా లేక, రోడ్లపై తిరిగే నిరాశ్రయులను ఆదుకునే చర్యల్లో భాగంగా శ్రద్ధ రిహెబిలిటేషన్‌ ఫౌండేషన్‌తో వైద్య శాఖ ఎంవోయూ చేసుకుంది.

మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై తిరిగే వా­రిని గుర్తించి శ్రద్ధ ఫౌండేషన్‌ ద్వారా చికిత్సలు అందిస్తున్నా­రు. ఇలా ఇప్పటి వరకూ వంద మంది బాధితులకు చికిత్సలు అందించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. మరోవైపు యువతలో ఆత్మహత్యల నియంత్రణకు ఎమోషనల్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ బై ఎడ్యుకేటర్స్, రెఫరల్‌ ఇన్‌ ఏపీ(ఈఏఎస్‌ఈ) కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. నిమ్‌హాన్స్, అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియా ఆరిజన్‌(ఆపీ) వంటి ప్రముఖ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వా­మ్యం అవుతున్నాయి. ఇప్పటి వరకూ మూడు వేల మందికిపైగా ఎంబీబీఎస్‌ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement