పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. చివరికి ట్విస్ట్‌ | Two Women Married In Srikalahasti Chittoor District | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. చివరికి ట్విస్ట్‌

Aug 10 2022 7:46 AM | Updated on Aug 10 2022 7:46 AM

Two Women Married In Srikalahasti Chittoor District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మహిళకు తమ బంధువైన వేంపల్లె రాజీవ్‌ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

వేంపల్లె(వైఎస్సార్‌ జిల్లా): ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్న ఘటన వైఎస్సార్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఎవరిళ్లకు వారిని పంపించివేశారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు, పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన వ్యక్తితో ఏడాది కిందట వివాహమైంది. వారి మధ్య మనస్పర్థలున్నాయి.
చదవండి: మాజీ ఎంపీ హర్షకుమార్‌ కుమారుడి నిర్వాకం.. యువతిపట్ల అసభ్యకర ప్రవర్తన

మహిళకు తమ బంధువైన వేంపల్లె రాజీవ్‌ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత శనివారం వీరిద్దరూ వెళ్లిపోయి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వివాహం చేసుకున్నారు. మంగళవారం వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. సీఐ సీతారామిరెడ్డి వారిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి, వారి బంధువులను పిలిపించి అప్పగించారు.   

Advertisement
 
Advertisement
Advertisement