ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు! | Travel Bus Rams Into Auto 8 Killed | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు!

Aug 27 2026 1:46 AM | Updated on Aug 27 2026 5:16 AM

Travel Bus Rams Into Auto 8 Killed

పల్నాడు: చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండమంజులూరు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఆటోను విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన బస్సు ఆటోను బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ఐదు మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మృతుల సంఖ్య మొత్తం ఏడుకు చేరింది. నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మ, మరియమ్మ సువార్తగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement