
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రేపు( గురువారం) వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.