వైఎస్సార్‌ జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు

TNSF Leaders Attack Former Councilor Sons In Rayachoti - Sakshi

సాక్షి, రాయచోటి: వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో టీడీపీ నేతలు బరితెగించారు. మాజీ కౌన్సిలర్‌ హజ్రత్‌ కుమారులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు ఫారుక్‌, అతని గ్యాంగ్‌ హజ్రత్‌ కుమారులతో గొడవకు దిగి చంపుతామంటూ కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. తౌహీద్‌ అనే యువకుడి పరిస్థితి విషమం ఉంది. వీరిని నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా దాడికి పాల్పడిన ఫారూక్‌ గ్యాంగ్‌ గతంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top