సాక్షి, అమరావతి: ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 32లక్షల మందే విద్యను అభ్యసిస్తున్నట్టు పాఠశాల, ఉన్నత విద్య కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ 9,620 మోడల్ ప్రైమరీ స్కూళ్లలో కనీసం 60 మంది విద్యార్థులు చొప్పున ఉండేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో డిసెంబర్ నాటికి 1,500 పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు.


