సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం నుంచి రెండురోజులపాటు వర్చువల్గా జరగనుంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీల్లో ఉన్న నేతలు మహానాడు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో అక్కడి నుంచే వారు ఆన్లైన్లో మాట్లాడుతారు. కాగా పొదుపు చేయడం కోసం వర్చువల్గా మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పిన నేతలు ఇంకా భారీగా ఖర్చు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.


