Ukraine: Students Parents Thanks To AP Government - Sakshi
Sakshi News home page

Ukraine-AP: గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ దగ్గర ఉద్విగ్న వాతావరణం

Feb 27 2022 1:22 PM | Updated on Feb 27 2022 3:56 PM

Students Parents Thanks To AP Government - Sakshi

ఉక్రెయిన్‌ నుంచి ఏపీకి విద్యార్థులు చేరుకుంటున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. విద్యార్థులు కావ్యశ్రీ,, సాయి ప్రవీణ్‌ విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

సాక్షి, విజయవాడ: ఉక్రెయిన్‌ నుంచి ఏపీకి విద్యార్థులు చేరుకుంటున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. విద్యార్థులు కావ్యశ్రీ, సాయి ప్రవీణ్‌ విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఏపీ విద్యార్థులకు నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: ఉక్రెయిన్‌ పెయిన్‌: తప్పెవరిదైనా మారింది కీవ్‌ నగరం.. శ్మశాన నిశ్శబ్దం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే..
ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు కు చెందిన విద్యార్థినులు సుష్మ, సుదర్శన ఇవాళ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్‌ నుండి రొమేనియా మీదుగా ముంబై చేరుకుని అక్కడి నుండి నేరుగా రాజమండ్రి చేరుకున్నామని విద్యార్థులు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే తాము తిరిగి తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకోగలిగామని సంతోష వ్యక్తం చేశారు. తాము బోర్డర్‌కు దగ్గరగా ఉండటం వల్ల వెంటనే రాగలిగామంటున్నారు. ఉక్రెయిన్ యూనివర్సిటీల్లో అనేక మంది తెలుగు, ఇండియన్ విద్యార్థులు ఉన్నారని వారందరికీ కూడా వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement