శ్రీకాకుళం: ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి, తల్లీకూతుళ్ల పరిస్థితి విషమం

Srikakulam: Fatal Accident Kills Father Son Duo - Sakshi

సాక్షి, శ్రీకాకుళం:  జిల్లాలోని నందిగాం మండలం పెద్దినాయుడుపేట వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయివాళ్లు తండ్రీకొడుకులుగా తెలుస్తోంది. 

బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు. ఇక ఈ ప్రమాదంలోనే గాయపడ్డ తల్లి, కుమార్తెలను ఆస్పత్రికి తరలించారు. వాళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top