Sajjala Ramakrishna Reddy: విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు
సాక్షి, గుంటూరు: టీడీపీ, ఎల్లోమీడియాపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, ఎల్లోమీడియా దిగజారుడు రాజకీయం చేస్తున్నాయి. వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. విజయమ్మ వ్యాఖ్యలపై పెడార్థాలు తీస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా