నేటి నుంచి సదరం క్యాంపులు | Sadaram Camps from today in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సదరం క్యాంపులు

Jul 19 2021 4:54 AM | Updated on Jul 19 2021 4:54 AM

Sadaram Camps from today in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా కొన్ని నెలలుగా నిలిచిపోయిన సదరం(దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ) క్యాంపులు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మొత్తం 171 ఆస్పత్రుల్లో దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలిస్తారు. ఆర్థోపెడిక్, మానసిక వైద్యులు, కంటి వైద్యులు.. ఇలా నిర్ణయించిన మేరకు అన్ని విభాగాల వైద్యులూ ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు సెంటర్లవారీగా కేటాయింపులు జరిపారు.

ఉదయం 8 గంటల నుంచే క్యాంపులు నిర్వహిస్తారు. గత ప్రభుత్వం హయాంలో 52 ఆస్పత్రుల్లోనే క్యాంపులు నిర్వహించేవారు. స్లాట్‌లు కూడా తక్కువగా ఉండేవి. ఈ పరిస్థితికి స్వస్తి చెప్పి ఆస్పత్రుల సంఖ్యను భారీగా పెంచారు. పైగా బాధితులకు 24 గంటల్లోనే ధ్రువీకరణ పత్రం జారీచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల విద్యా, ఉద్యోగాలకే కాకుండా, ప్రభుత్వ పథకాలకూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు దివ్యాంగులకు లభిస్తుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement