నడి రోడ్డు మీద లంచావతారం.. | RTA Employee Accept Bribe Suspended At Tadepalligudem | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ ఉద్యోగి లంచావతారం.. సస్పెన్షన్‌ వేటు

Nov 6 2020 7:44 PM | Updated on Nov 6 2020 8:14 PM

RTA Employee Accept Bribe Suspended At Tadepalligudem - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: నడిరోడ్డుపై ఆర్టీఏ ఉద్యోగి లంచావతారం ఎత్తిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో చోటుచేసుకుంది. వాహనాదారుల నుంచి మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ మృత్యుంజయరాజు డబ్బులు వసూలు చేస్తున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో దీనిపై వెంటనే స్పందించారు. తాడేపల్లి గూడెం బైపాస్ రోడ్డుపై అధికారిక యూనిఫామ్‌లో లేకుండా వాహన డ్రైవర్ల నుండి లంచాలు వసూలు చేస్తున్నా ఎంవీఐ మృత్యుంజయరాజును సస్పెండ్‌ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ సీతా రామాంజనేయులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి:  (దివ్య హత్య కేసు: దిశా పోలీస్‌ స్టేషన్‌కు నాగేంద్ర)

Advertisement
 
Advertisement
Advertisement