బెదిరింపులు తట్టుకోలేక వీసీల రాజీనామా | Resignation of VCs unable to withstand threats | Sakshi
Sakshi News home page

బెదిరింపులు తట్టుకోలేక వీసీల రాజీనామా

Jun 30 2024 3:51 AM | Updated on Jun 30 2024 3:51 AM

Resignation of VCs unable to withstand threats

వెంకటాచలం/గుంటూరు (ఏఎన్‌యూ)/కడప (వై­వీ­యూ): కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శ్రుతిమించాయి. చివరకు ఉన్నత విద్య అందించే విశ్వవిద్యాలయాలపైనా కర్రపెత్త­నం ప్రారంభించింది. వర్సిటీల వీసీలను తప్పుకో­వా­లంటూ బెదిరింపులకు దిగడమేగాక తీవ్ర వేధింపు­లకు గురిచేస్తుండడంతో తట్టుకోలేక వారు రాజీ­నా­మాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే పలు వర్సిటీ­ల వీసీలు రాజీనామా చేయగా.. తాజాగా మరికొంద­రు అదే బాటపట్టారు.

టీడీపీ నేతల వేధింపులను తట్టుకోలేక నెల్లూరులోని విక్రమ సింహపురి యూని­వర్సిటీ వీసీ జీఎం సుందరవల్లి, రిజిస్ట్రార్‌ పి.రామ­చంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీ­నా­మా పత్రాలను రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయానికి శుక్ర­వారం పంపించారు. 

ఈ నెల 5న టీడీపీ, టీఎ­న్‌­ఎస్‌­ఎఫ్‌ నేతలు విశ్వవిద్యాలయంలోకి చొర­బడి వీ­సీ, రి­జిస్ట్రార్లతో పాటు అధ్యాపక బృందాలపై దాడి చేశా­రు. అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశా­రు. కాగా..  యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ రాజీ­నా­మా చేసి వెళ్లిపోవాలని విద్యాశాఖ మంత్రి పీఏ ఫోన్‌ ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి ఒత్తిడి చేస్తు­న్నారు. దీంతో వారిద్దరూ రాజీనామాలు సమర్పించారు.

అదే బాటలో వైవీయూ వీసీ
కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ చింతా సుధాకర్‌ గవర్నర్‌ కార్యాలయానికి రాజీనామా సమర్పించారు. కాగా.. రిజిస్ట్రార్‌ వైసీ వెంకట సుబ్బయ్య రాజీనామాను వీసీ ఆమోదించారు. టీడీపీకి చెందిన ఓ వ్యక్తి విద్యాశాఖ మంత్రి ఓఎస్‌డీగా తాను చేరబోతున్నానని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియమితులైన వీసీలు, రిజిస్ట్రార్‌లు రాజీనామాలు సమర్పించాలంటూ ఫోన్లు చేశారు. 

అనధికార ఓఎస్‌డీ ఫోన్‌కాల్స్‌ పట్టించుకోవాల్సిన పనిలేదని భావించారు. అయితే, తర్వాత రోజు వీసీ­ల వాట్సా‹­³ గ్రూపుల్లో సైతం అందరూ రాజీనామా­లు సమర్పించాలని వీసీలు, రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీనికి తోడు అధికార పార్టీ అను­బంధ విద్యార్థి సంఘాలను విశ్వవిద్యాలయా­లపైకి ఉసిగొల్పి అనవసర రాద్ధాంతం చేస్తూ వచ్చారు. 

వైఎస్సార్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ రాజీనామా
కడప నగరంలోని వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం (వైఎస్సార్‌ ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్‌ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి జూన్‌ 5న పదవికి రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీప బంధువు కావడంతో ఈ­య­నపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ విద్యా­ర్థి సంఘాల నాయకులను ఉసిగొల్పారు. 

తాజా­గా శనివారం ఆయన రాజీనామాను ఏఎఫ్‌యూ వైస్‌ చాన్సలర్‌ బానోతు ఆంజనేయప్రసాద్‌ ఆమోదించారు. దీంతో ఆయన తిరిగి మాతృవిశ్వవిద్యా­లయం వైవీయూలో బయో టెక్నాలజీ ఆచార్యులు­గా చేరారు. కాగా.. వైఎస్సార్‌ ఏఎఫ్‌యూ వైస్‌ చాన్సలర్‌ బానోతు ఆంజనేయప్రసాద్‌ సైతం సో­మవారం రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

ఏఎన్‌యూ వీసీ రాజీనామాకు నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) వీసీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వీసీ పి.రాజశేఖర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లు రాజీనామా చేస్తున్న తరుణంలో తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు శనివారం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement