సీఎం జగన్కు రుణపడి ఉన్నాం
టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు
సాక్షి, తిరుమల: అర్చకులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు అవతరిస్తారన్నారు. భగవంతుని ఆశీస్సులతో సీఎం వైఎస్ జగన్ ధర్మాన్ని నిలబెట్టారన్నారు. సీఎం జగన్ పాలన దిగ్విజయంగా సాగాలని స్వామివారిని కోరుకుంటునన్నారు. సీఎం జగన్కు తాము ఎంతో రుణపడి ఉన్నామని తెలిపారు. దేవాలయాలకు పునర్ వైభవం వైఎస్ జగన్ ద్వారా వస్తుందనే నమ్మకం కలిగిందని రమణ దీక్షితులు అన్నారు.
చదవండి:
దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..?
ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి వాయిదా