సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంకా మాస్కులు అందని ప్రతి ఒక్కరికి మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 33 లక్షల మీటర్ల క్లాత్ కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర జనాభా 4,87,54,176 మంది కాగా ఇప్పటికే 3,70,13,300 మందికి మూడేసి చొప్పున 11.10 కోట్ల మాస్కులను ప్రభుత్వం పంపిణీ చేసింది. మాస్కుల తయారీకి అవసరమైన క్లాత్ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆప్కో నుంచి అధికారులు కొనుగోలు చేశారు. అయితే.. 1.30 కోట్ల మీటర్ల క్లాత్ను సరఫరా చేశాక నిల్వలు తరిగిపోవడంతో ఆ సంస్థ సరఫరా నిలిపివేసింది. దీంతో మాస్కుల పంపిణీ పలుచోట్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి రాగానే ప్రైవేట్ వ్యాపారుల వద్ద నుంచి అయినా క్లాత్ కొనుగోలు చేసి.. మిగిలిపోయిన వారికి కూడా మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించడంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు క్లాత్ కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టెండర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
► ఇంకా మాస్కులు అందని 1,17,40,876 మందికి మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేసేందుకు 33 లక్షల మీటర్ల క్లాత్ అవసరమని అధికారులు నిర్ధారించారు.
► టెండర్ ప్రక్రియలో ఆప్కోకు చెల్లించిన ధర కంటే దాదాపు 30–35 శాతం తక్కువ ధరకే క్లాత్ సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారని అధికారులు చెబుతున్నారు.
► విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో అందరికీ మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ పూర్తయిందని.. మిగిలిన జిల్లాల్లో మూడొంతులు పూర్తయిందని చెప్పారు.
► మాస్కులు కుట్టే పనిని పొదుపు సంఘాల మహిళలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఒక్కొక్క మాస్కు సింగిల్ లేయర్తో కుడితే రూ. 3 చొప్పున.. డబుల్ లేయర్తో కుడితే రూ.3.50 చొప్పున మహిళలకు చెల్లిస్తున్నారు.
► పొదుపు సంఘాల మహిళలు మాస్కులు తయారుచేశాక వాటిని సెర్ప్, మెప్మా సిబ్బంది సేకరించి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగిస్తారు.
మాస్కుల కోసం 33 లక్షల మీటర్ల క్లాత్ కొనుగోలు
Published Sat, Aug 15 2020 5:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement