పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Preserving The Environment is Everyone's Responsibility Says DD Chinna Peddaiah - Sakshi

రాయచోటి టౌన్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని డ్వామా డీడీ చిన్నపెద్దయ్య సూచించారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటి డ్వామా కేంద్రంలో జిల్లాలోని మండలాల జాతీయ ఉపాధి హామీ  ఏపీడీలు, ఏపీవోలు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత మూడు సంవత్సరాలుగా జరిగిన ఉపాధి పనులపై సమీక్షించుకోవాలని చెప్పారు.

వీటిలో ఏ సంవత్సరంలో ఎక్కువ పనిదినాలు జరిగాయనే అంశాలను తీసుకొని జరిగిన ఎక్కువ రోజులకు మరో 20శాతం కలుపుకొని దానినే టార్గెట్‌గా చేసుకోవాలన్నారు. రాబోవు రోజులలో దీనినే  టార్గెట్‌ చేసుకొని ఆ పద్ధతి ప్రకారం పనిదినాలు పెంచాలని చెప్పారు. అలాగే పర్యావరణాన్ని కాపాడే విధంగా అన్ని ప్రధాన రోడ్ల వెంట మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. నాటడానికి సిద్ధంగా ఉన్న మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనను అధికారులందరూ కలసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జీఎస్‌ కౌన్సిల్‌ సభ్యుడు విశ్వనాథం, పీడీ శివప్రసాద్, ఏపీడీలు, ఏసీలు, ,అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top