సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో కాల్పుల కలకలం రేగింది. దొంగల ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. దొంగల ముఠాపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల నుంచి ముఠా తప్పించుకుని పారిపోయింది. పరిగి మండలం ఊటుకూరు దగ్గర ఘటన జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం హిందూపురం పట్టణంంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
అయితే, బోలేరో వాహనంలో వెళ్తున్న దొంగల ముఠా ఆగకుండా వెళ్లిపోయారు. ఏపీ- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో రెండు గంటల పాటు పోలీసులు ఛేజ్ చేశారు. పరిగి మండలం ఊటుకూరు దగ్గర పోలీసులు కాల్పులు జరిపారు. దుండగులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ నెల 6వ తేదీన దుండగులు పోలీసు జీపును ఢీకొన్నారు. ఇప్పుడు కూడా అదే గ్యాంగ్ హిందూపురంలో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగల ముఠా కోసం హిందూపురం పోలీసులు గాలిస్తున్నారు.


