సర్కారు నిర్ణయంతో పవన్‌ క్వాష్‌ ఉపసంహరణ | pawan withdrew the quash petition: Andhra pradesh | Sakshi
Sakshi News home page

సర్కారు నిర్ణయంతో పవన్‌ క్వాష్‌ ఉపసంహరణ

Oct 21 2024 5:17 AM | Updated on Oct 21 2024 5:17 AM

pawan withdrew the quash petition: Andhra pradesh

అనుమతించిన హైకోర్టు

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హ­యాంలో టీడీపీ, జనసేన నేతలపై కో­ర్టు­ల్లో దాఖలైన పరువు నష్టం కేసులన్నింటినీ ఉపసంహరించేందుకు కూట­మి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, గుంటూరు కోర్టులో తనపై దాఖలై­న పరువు నష్టం కేసును కొట్టేయాలని కోరుతూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హైకోర్టులో దా­ఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అప్పట్లో వలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని పవన్‌ క్వాష్‌ పిటిషన్‌ దా­ఖలు చేశారు.

చట్ట ప్రకారం ప్రత్యా­మ్నా­య మార్గాలను చూసుకునేందుకు వీ­లు­­గా ఈ వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతివ్వాలని కోరుతూ శనివారం ప­వన్‌ తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో విచారణ జరపాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. తమ క్వాష్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతివ్వాలని పవన్‌ తరఫున సీనియర్‌ న్యా­యవాది పోసాని వెంకటేశ్వర్లు కో­రారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులిచ్చారు.

కా­గా, గతేడా­ది ఏలూరులో పవన్‌ మాట్లా­డుతూ ఏపీలో పెద్ద సంఖ్యలో ఆడ పిల్లలు కనిపించకుండా పోతున్నారని, దీని వెనుక వలంటీర్లు ఉన్నారంటూ అనుచిత వ్యా­ఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య­లు ప్రభుత్వ పరువు, ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, పవన్‌పై సంబంధిత కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేయా­లని గుంటూరు కోర్టు పీపీని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పీపీ గుంటూరు కోర్టులో పవన్‌పై  క్రిమినల్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement