సాక్షి, న్యూఢిల్లీ: టీటీడీలో తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్తో జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడుతూ.. ‘పేరు ఇలా ఉందేమిటి? అసలు పేరు ఏమిటి’ అని అడిగారు. తన పేరు శ్రీవారి దాసానుదాసుడు అని, ఏలూరి శేషయ్య కుమారుడినని, అందరూ తనను శ్రీవారి దాదా అని పిలుస్తారని పిటిషనర్ చెప్పగా, వ్యవహారాల్లో అసలు పేరు ఉపయోగించాలని హితవు పలికారు.
పిటిషనర్ వ్యక్తిగతంగా వాదన వినిపించడానికి అనుమతి ఇవ్వడంతో తిరుమలలో పూజలు సంప్రదాయంగా జరగడం లేదంటూ సమస్యలు ఏకరువు పెడుతుండగా.. జస్టిస్ ఎన్వీ రమణ అతన్ని నిలువరించారు. ‘పిటిషన్ను జాబితాలో త్వరగా చేర్చాలని ప్రతిరోజూ రిజిస్ట్రీని బెదిరిస్తారా? ఏమంత అత్యవసరం వచ్చింది? పూజలు ఎలా నిర్వహించాలి? ఎప్పుడు నిర్వహించాలో జోక్యం చేసుకొనే అవసరం ఏమిటి? ఏ చట్ట ప్రకారం కోర్టులు జోక్యం చేసుకోవాలి? ఇదేమైనా రాజ్యాంగ ఉల్లంఘనా? ఎంత మందిని దర్శనానికి అనుమతించాలనే అంశంపై టీటీడీని ప్రశ్నించడం ప్రాథమిక హక్కు కిందకు రాదు.
నాతో సహా న్యాయమూర్తులు అందరూ శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తులే. పూజలు సంప్రదాయంగా జరగాలనే కోరుకుంటాం’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ దశలో పిటిషనర్ జోక్యం చేసుకోబోగా వారిస్తూ.. శ్రీవారి భక్తులకు సహనం ఉండాలని సూచించారు. గతేడాది మార్చిలో పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారని టీటీడీ తరఫు న్యాయవాది సత్య సభర్వాల్ను ప్రశ్నించారు. వారం రోజుల్లో కౌంటరు దాఖలు చేస్తామని ఆయన తెలుపడంతో తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
టీటీడీలో తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు
Published Thu, Sep 30 2021 5:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement