స్థిరంగా అల్పపీడనం | Sakshi
Sakshi News home page

స్థిరంగా అల్పపీడనం

Published Tue, Sep 14 2021 5:43 AM

Moderate rain for two days in Andhra Pradesh - Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని చాంద్‌బలికి దక్షిణంగా సోమవారం తీరం దాటింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ రానున్న 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా మధ్యప్రదేశ్‌ వైపు కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని అధికారులు తెలిపారు.   

Advertisement
Advertisement