మార్కెట్‌ యార్డుల్లో విద్యుత్‌ ఆదాకు చర్యలు | Measures to save electricity in market yards | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ యార్డుల్లో విద్యుత్‌ ఆదాకు చర్యలు

Sep 11 2023 4:21 AM | Updated on Sep 11 2023 4:21 AM

Measures to save electricity in market yards - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు మార్కెట్‌ యా­ర్డు­ల్లో ఇంధన సామర్థ్య చర్యల ద్వారా విద్యుత్‌ను, డబ్బును ఆదా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావి­స్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. గుంటూరు యార్డును ఆసియాలోనే అతిపెద్ద విద్యు­త్‌ ఆదా మిర్చి వ్యాపార కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌­(ఈఈఎ­స్‌ఎల్‌) రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖతో భాగ­స్వామి అయ్యేందుకు అంగీకరించింది. రాష్ట్రంలోని మరి­కొన్ని కీలక మార్కెట్‌ యార్డుల్లో కూడా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయనుంది.

వ్యవ­సాయ వాణిజ్యానికి మార్కెట్‌ యార్డులు కీలక కేంద్రాలు. ఇక్కడ లైటింగ్, శీతలీకరణ, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్‌ కోసం విద్యుత్‌ను ఎక్కువగా వినియో­గిస్తుంటారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వీటిని విద్యు­త్‌ పొదుపు కేంద్రాలు­గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్‌ శాఖ ప్రిన్సి­పల్‌ సెక్రట­రీ చిరంజీవితో ఈఈఎస్‌ఎల్‌ కమ్యూని­కేషన్స్, మార్కెటింగ్‌ సీజీఎం అనిమేష్‌ మిశ్రా ఆది­వారం భేటీ అయ్యారు.

విద్యుత్‌ ఆదా చర్యలకు సంబంధించి­న నివేదికను చిరంజీవికి అందజేశారు. అనంతరం ఈఈఎస్‌ఎల్‌ అధికారులు, మార్కెటింగ్, సహ­కార శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. తొలుత గుంటూరు మిర్చి యార్డులో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేస్తా మన్నారు. ఈఈఎస్‌ఎల్‌ ప్రతినిధులు నితిన్‌ భట్, సావిత్రి సింగ్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ రాహుల్‌ పాండే, ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement