చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. సిగ్నల్‌ కట్‌ చేసి... | Massive Robbery In Chengalpattu Express In Anantapur District, More Details | Sakshi
Sakshi News home page

చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. సిగ్నల్‌ కట్‌ చేసి...

Jun 24 2025 9:08 AM | Updated on Jun 24 2025 10:53 AM

Massive Robbery In Chengalpattu Express In Anantapur District

సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ ఘటన జరిగింది.

దుండగులు కోమలి సమీపంలో సిగ్నల్‌ కేబుల్‌ కట్‌ చేయడంతో రైలు నిలిచిపోయింది. ఎస్1, ఎస్2 బోగీల్లోకి చొరబడిన దుండగులు.. ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు నగలు దోచుకున్నారు. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారీ అయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement