భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలియడంతో.. | Married woman ends life in Vizianagaram | Sakshi
Sakshi News home page

భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలియడంతో..

Jul 21 2026 10:04 AM | Updated on Jul 21 2026 10:29 AM

Married woman ends life in Vizianagaram

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): గరివిడి మండలం కొండశంభాం గ్రామానికి చెందిన వివాహిత పిల్లా శ్రీలక్ష్మి  పురుగు మందు తాగి  ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి గరివిడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చీపురుపల్లి మండలంలోని కరకాం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మికి కొండశంభాం గ్రామానికి చెందిన పిల్లా సాయితో ఈ నెల 2వ తేదీన  వివాహం జరిగింది. శ్రీలక్ష్మి గతంలో హైద్రాబాద్‌లో ఉద్యోగం చేసేది. హైదరాబాద్‌లో ఉండేటప్పుడు ఓ వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండేదన్న విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు  తలెత్తాయి. 

ఈ విషయాన్ని తన భర్త తండ్రికి తెలియజేస్తే తట్టుకోలేడని మనస్తాపం చెందిన శ్రీలక్ష్మి ఈ నెల 17న పురుగు మందు తాగేసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆమెను వెంటనే విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి కడగల బంగారునాయుడు ఫిర్యాదు మేరకు ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement