
అల్లూరి జిల్లా: ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ కోరుతూ డీఎస్సీ సాధన సమితి.. మన్యం బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార వాణిజ్య సముదాయాలను మూసివేశారు.
ఈ బంద్లో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, కుంభ రవిబాబు, రేగ మత్స్య లింగం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 3 ను సీఎం చంద్రబాబు పునరుద్ధరించాలి. లేదా జీవో నెంబర్ 3 కు ప్రత్యామ్నాయం మార్గం చూపించాలి. ఏజెన్సీ ప్రాంతంలో 776 ఉపాధ్యాయుల పోస్టులకు 42 పోస్టులు మాత్రమే దక్కుతున్నాయి.’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.