సాక్షి, అమరావతి: రబీ సీజన్లో రాయితీపై ఇచ్చే వివిధ రకాల విత్తనాలను ఈనెల 10 నుంచి పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 12 రకాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసినట్టు బుధవారం ‘సాక్షి’కి చెప్పారు. రబీ సీజన్లో అత్యధికంగా సాగు చేసే వాటిలో ఒకటైన శనగ విత్తనాల పంపిణీ గురువారం కర్నూలు జిల్లాలో లాంఛనంగా ప్రారంభమవుతుందన్నారు. మిగతా జిల్లాల్లో పదో తేదీ నుంచి మొదలవుతుందన్నారు. ఆయన తెలిపిన వివరాలివీ..
► 42,023 క్వింటాళ్ల వరి వంగడాలను, 30,819 క్వింటాళ్ల వేరుశనగ, 2,92,319 క్వింటాళ్ల శనగలు, 3,500 క్వింటాళ్ల పెసలు, 11,051 క్వింటాళ్ల మినుములు, 589 క్వింటాళ్ల రాగులు, 42 క్వింటాళ్ల కొర్రలు, 50 క్వింటాళ్ల ఊదలు, 30 క్వింటాళ్ల ఆరికలు, 32 క్వింటాళ్ల సామలు, 2 క్వింటాళ్ల కందులు, 25 క్వింటాళ్ల ఆండ్రు కొర్రలు పంపిణీకి సిద్ధం చేశాం.
► వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతుంది.
► సబ్సిడీపై ఎకరానికి 25 కిలోల శనగల్ని ఇస్తారు. సబ్సిడీ లేని రైతులు పూర్తి మొత్తాన్ని చెల్లించి కొనవచ్చు.
► జేజీ 11 రకం శనగలు క్వింటాల్ పూర్తి విలువ రూ.7,500 కాగా, ప్రభుత్వం రూ.2,250 సబ్సిడీగా ఇస్తుంది. కేఏకే–2 రకం శనగలు క్వింటాల్ పూర్తి ధర రూ.7,700 కాగా, రూ.2,310 సబ్సిడీగా ఇస్తారు.
► విత్తన నాణ్యతపై ఫిర్యాదులుంటే రైతులు 155251 నంబర్కు కాల్ చేయవచ్చు.
10 నుంచి రాయితీపై రబీ విత్తనాలు
Published Thu, Oct 8 2020 5:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement