సాక్షి,విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్పై మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. థర్డ్ డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందుకే గాదె సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారు. ఫోరెన్సిక్, డీఎన్ఏ సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు, సాయికృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు.
కమాండ్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ సీపీ ఎస్వీ రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేయాలి. విజయవాడలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ మరిచి, మాఫియాల కొమ్ముకాస్తూ ప్రైవేట్ సెటిల్మెంట్ సిండికేట్ నడుపుతున్నారు. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, హత్యపై సెక్షన్ 176(1A) కింద తక్షణమే స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరారు.


