‘తుని–సబ్బవరం’ను జాతీయ రహదారిగా మార్చండి  | karanam dharmasri appealed to Union Minister Nitin Gadkari | Sakshi
Sakshi News home page

‘తుని–సబ్బవరం’ను జాతీయ రహదారిగా మార్చండి 

Nov 3 2022 5:14 AM | Updated on Nov 3 2022 5:14 AM

karanam dharmasri appealed to Union Minister Nitin Gadkari - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలోని తుని–సబ్బవరం రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రితో భేటీ అనంతరం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు.

133 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి రూ.2,200 కోట్లు ఖర్చవుతుందన్నారు. దీనికి సంబంధించి డీపీఆర్‌ కూడా పూర్తయిందని చెప్పారు. రహదారి పనులు వేగంగా చేపట్టాలని కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేశానన్నారు. ఈ రహదారి పూర్తయితే ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement