నకిలీ మద్యాన్ని బాత్రూంలో పారబోసి.. | Janardhan Rao Grilled In AP Fake Liquor Case Updates, More Details Inside | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యాన్ని బాత్రూంలో పారబోసి..

Oct 11 2025 9:19 AM | Updated on Oct 11 2025 11:06 AM

Janardhan Rao Grilled In AP Fake Liquor Case Updates

సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో(AP Fake Liquor Case) ప్రధాన నిందితుడు జనార్దన్‌ రావును రహస్య ప్రాంతంలో ఎక్సైజ్‌ అధికాలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విచారణలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ-1 నిందితుడు అద్ద్దేపల్లి జనార్దనరావును అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నడుమ.. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఎన్టీఆర్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఈస్‌టీఎఫ్‌) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే.. 

నకిలీ మద్యం అమ్మకాలలో వచ్చిన డబ్బులతో నిందితులు భూములు కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ కేసులో A12 నిందితుడైన కళ్యాణ్.. జనార్దన్‌ రావు పిన్ని కొడుకు. ఈ మధ్యకాలంలో కళ్యాణ్‌ గొల్లపూడిలో రూ.3 కోట్ల విలువైన ల్యాండ్‌ను కొనుగోలు చేశాడు. అది నకిలీ మద్యం సొమ్మేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. 

అంతేకాదు.. ఇబ్రహీంపట్నం డెన్‌లో తనిఖీల సమయంలో కళ్యాణ్ సుమారు 60 కేసుల నకిలీ మద్యాన్ని బాత్రూంలో పారబోసినట్టు గుర్తించారు. జనార్ధన్ రావు పూర్తిగా నోరు విప్పితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

స్కెచ్‌ ఎలా ఉందంటే..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేతలు స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. వాళ్లలో కొందరు కొందరు అధికార బలంతో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ యూనిట్లు మొదలు పెట్టారు. ఈ క్రమంలో.. ములుకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డెన్‌లను జనార్దన్‌ రావు(TDP Janardhan Rao) నేతృత్వంలో ఏర్పాటు చేసినట్లు తేలింది. 

బెల్ట్ షాపులుతో మొదలు పెట్టి.. వైన్స్, బార్ల షాపులలో నకిలీ మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్‌ పోలీసులు గుర్తించారు. చిత్తూరు, ఏలూరు, ఉమ్మడి కృష్టా జిల్లా లో నకిలీ మద్యం ఏ మద్యం దుకాణాల్లో సరఫరా చేశారని జనార్దన్ రావుని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ డెన్‌లు ఏర్పాటు చేశారని నిలదీస్తున్నారు. అదే సమయంలో.. మరో టీడీపీ నేత జయ చంద్రారెడ్డికి జనార్ధన్ రావుకి మద్య ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం. 

రాష్ట్రంలో దొరికిన ప్రతి నకిలీ మద్యం డెన్ మూలాలు జనార్ధన్ రావు వైపు చూపిస్తున్నట్టు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు.. ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళే జనార్దన్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: నకిలీ మద్యంపై కదం తొక్కిన మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement