అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు | Hyderabad And Madras IIT Teams Face Flood Woes In Amaravati, Details Inside | Sakshi
Sakshi News home page

అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు

Aug 3 2024 9:22 PM | Updated on Aug 4 2024 7:04 PM

Iit Teams Face Flood Woes In Amaravati

అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు ఎదుర్యయాయి.

సాక్షి, గుంటూరు: అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు ఎదుర్యయాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఐఐటీ హైదరాబాద్, మద్రాస్ బృందాలు.. నిర్మాణాల నాణ్యతను పరిశీలించాయి. రాజధానిలో వరద చేరడంతో బృందాలు.. పడవలో వెళ్లి పనులు పరిశీలించాయి.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సహాయంతో వరద నీటిలో బృందాలు పర్యటించాయి. జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులు, ర్యాప్ట్‌ ఫౌండేషన్ పనులను బృంద సభ్యులు పరిశీలించారు. వరద నీటిలో ఉన్న జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులను కూడా  ఐఐటీ బృందం పడవలో వెళ్లి పరిశీలించింది. వరద నీటిని చూసి షాక్‌ తిన్న ఐఐటీ బృందం.. చిన్నపాటి వర్షాలకే ఇలా వరద చేరడంపై ఆశ్చర్యపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement