ఇంకా మిస్టరీగానే నం‍ద్యాల ముచ్చుమర్రి కేసు! | girl kidnapping case: no update disappearing girl nandyal district | Sakshi
Sakshi News home page

ఇంకా మిస్టరీగానే ముచ్చుమర్రి కేసు.. స్థానికుల్లో పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలు

Jul 13 2024 3:14 PM | Updated on Jul 13 2024 4:01 PM

girl kidnapping case: no update disappearing girl nandyal district

సాక్షి, నంద్యాల:  నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి  అదృశ్యమై ఆరో రోజులు గడుస్తున్నా  ఈ కేసులో పురోగతి  కనిపిచటం లేదు. ఒక్క బోటుతో గాలింపు  చర్యలు కొనసాగుతున్నాయి. బాలిక తల్లిదండ్రులను ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. 

వారం గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలన్నారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబం, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 

ఈ కేసు మిస్టరీగానే ఉంటుందా? లేక పోలీసులు ఛేదిస్తారా? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఆరు రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ లభించపోవటంతో ముచ్చుమర్రి ప్రజలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎదురు చూపులు చూస్తున్నారు.  అభం శుభం తెలియని తొమిదేళ్ళ చిన్నారి అదృశ్యంపై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియకపోవడంపై సర్వత్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డీఐజీ స్థాయి అధికారి ఘటన స్థలానికి చేరుకుని సీను రికస్టక్షన్ చేసినా కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు.

	7 రోజులుగా వీడని బాలిక మిస్సింగ్ మిస్టరీ..

చదవండి: రేప్‌ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement