-
సెల్ఫోన్ మాట్లాడవద్దన్నందుకు..
కాచిగూడ: సెల్ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దన్నందుకు ఓ బాలిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన సంఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కాచిగూడ ఎస్ఐ నరేష్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్కు చెందిన బాలాజీ రావు కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం ఈ నెల 8న కాచిగూడ, సుందర్నగర్ లోని బంధువుల ఇంటికి వచ్చారు. బాలాజీరావు కుమార్తె సీహెచ్ గౌరీ (13) 8వ తరగతి చదువుతోంది. సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుండడంతో తల్లి, సోదరుడు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి లోనైన మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయింది. సెల్ఫోన్ కూడా వెంట తీసుకెళ్లింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. సెల్ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉంది. గౌరి సోదరుడు విష్ణు కార్తి ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వద్దంటే భర్త డ్యూటీకి వెళ్లాడని..
హైదరాబాద్: నెల రోజుల క్రితమే నేపాల్లో వివాహం చేసుకుని భర్తతో నగరానికి వచ్చిన నేపాల్కు చెందిన యువతి అదృశ్యమైన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్ఐ నరేష్ కుమార్ సమాచారం మేరకు... హిమాయత్నగర్ బ్లూ ఫాక్స్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసే సోను తాప నెల క్రితం నేపాల్లోని తన పక్క గ్రామం అంజ్కోట్కు చెందిన ఊర్మిళ (22) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే భార్య ఊర్మిళను నగరానికి తీసుకొచ్చాడు. హిమాయత్నగర్లోని ఉర్దూ హాల్ లేన్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్యతో పాటు నివాసం ఉంటున్నాడు. ఈ నెల 9వ తేదీన మధ్యహ్నం 2 గంటల సమయంలో భర్త సోను డ్యూటీకి వెళ్తుండగా ఊర్మిళ ఈ రోజు డ్యూటీ వెళ్లవద్దని చెప్పిందని, అయినా సోను డ్యూటీకి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో భార్య ఊర్మిళ తాను తన అమ్మవారి ఇంటికి నేపాల్కి తిరిగి వెళ్లిపోతున్నట్లు భర్తకు మెసేజ్ చేసింది. వెంటనే భర్త ఇంటికి వచ్చి చూడగా తాను కనిపించలేదని తన అమ్మవారింటికి వెళ్లిందని అనుకున్నాడు. అయితే రెండు రోజులు గడిచినా నేపాల్కి వెళ్లిందో లేదో అని ఊర్మిళ అమ్మవారికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయడం లేదని, భర్త నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్కుమార్ తెలిపారు. -
సన్నీ లియోన్ గొప్పమనసు .. రూ.50 వేల రివార్డ్ ప్రకటించిన నటి!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తప్పిపోయిన బాలిక ఆచూకీ తెలిపిన వారికి ప్రత్యేకంగా తానే రూ.50 వేల రివార్డ్ ఇస్తానని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో పంచుకుంది. ఆ బాలిక ఫోటోతో పాటు చిరునామా, ఫోన్ సంబంధించిన వివరాలు షేర్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో చూద్దాం. సన్నీ లియోన్ ఇంట్లో ముంబయికి చెందిన కిరణ్ మోరే అనే వ్యక్తి పని చేస్తున్నారు. అతనికి అనుష్క అనే 9 ఏళ్ల కూతురు ఉంది. అయితే 8వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో తప్పిపోయింది. దీంతో బాలిక కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు. ఎవరైనా బాలిక ఆచూకీ చెబితే 11 వేల రూపాయలు పారితోషికం ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రూ.50 వేల రివార్డ్ అయితే బాలిక సమాచారం ఇచ్చినవారికి తాను వ్యక్తిగతంగా రూ.50 వేల రూపాయలు ఇస్తానని సన్నీ లియోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కానీ.. సన్నీ లియోన్ చివరిసారిగా అనురాగ్ కశ్యప్ చిత్రం కెన్నెడీలో కనిపించింది. ఇది చూసిన సన్నీ అభిమానులు.. దేవుడా ఎలాగైనా ఆ బాలికను రక్షించు అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు సన్నీ లియోన్ మానవత్వం పట్ల అభినందనలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
రాజస్తాన్లో దారుణం.. అత్యంత పాశవికం, బాలికపై హత్యాచారం
జైపూర్: రాజస్తాన్లో భిల్వారాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు రాక్షసులు 14 ఏళ్ల బాలికను చంపి, బొగ్గు బట్టీలో కాల్చేశారు. బుధవారం ఉదయం మేకల కాపలాకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె సోదరుడు, గ్రామస్తులు వెతుకులాట మొదలుపెట్టారు. రాత్రికి గ్రామ సమీపంలోని మండుతున్న ఒక బట్టీలో బాలిక చేతి గాజు, ఎముక ముక్కలు..ఆ పక్కనే బాలిక చెప్పులు వారికి కనిపించాయి. దీంతో, వారు బట్టీలు నిర్వహించే కల్బేరియా తెగకు చెందిన అయిదుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారం చేశాక, చంపి కొలిమిలో పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను ప్రశ్నిస్తున్నట్లు కోట్రి పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు. -
లేఆఫ్స్ సంక్షోభం: పాప మిస్సింగ్.. ఆందోళనలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థల్లో ఉద్యోగాల కోత ఆయా కుటుంబాల్లో తీరని క్షోభ మిగిల్చుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఉంటూ ఐటీ ఉద్యోగం కోల్పోయిన వారు హెచ్1బీ వీసా గడువు ముగిస్తుండటం, 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు మధ్య వారి కష్టాలు వర్ణనాతీతం. యూఎస్లో ఉంటున్న భారతీయ కుటుంబంలో ప్రస్తుతం అలాంటి ఇబ్బందుల్లో పడింది. ఇండియాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతో ఒక బాలిక కనిపించకుండా పోయిన వైనం ఆందోళన రేపింది. న్యూస్మినిట్అందించిన వివరాల ప్రకారం అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంటున్న పవన్ రాయ్ మరుపల్లి, శ్రీదేవి దంపతుల కుమార్తె తన్వి (14) గత రెండు వారాలకు పైగా కనిపించకుండా పోయింది. ఎందుకంటే పవన్ ఉద్యోగం పోతుందన్న భయంతో, తిరిగి ఇండియాకు వెళ్లి పోవాలని ఆలోచన చేస్తున్నారు. దీనికి భయపడే తన్వి ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని అంచనా. తన్వి కోసం స్నేహితులు, బంధువులు ఇతరులు ఎంత శోధించినా ఎలాంటి ఫలితం లేదు. చివరిసారిగా జనవరి 17న బస్సులో పాఠశాలకు బయలు దేరినప్పుడు ఆమె పరిసరాల్లో కనిపించింది. జనవరి 17న కాన్వే జూనియర్ హైస్కూల్లో బస్ పికప్ ఏరియా వైపు వెళుతున్నప్పుడు సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో ఆమె చివరిసారిగా కనిపించిందట. బస్సు ఎక్కుండా, తన్వి డేవిస్ స్ట్రీట్లో ఉత్తరాన నడుస్తూ కనిపిస్తోంది. తన్వి తన మొబైల్ , స్మార్ట్ఫోన్ను ఇంట్లోనే వదిలి వెళ్లడంతో కనుక్కోవడం మరింత కష్టమని తెలుస్తోంది. దీంతో ఆమె ఆచూకీ తెలిపిన వారికి 5వేల డాలర్ల నగదు బహుమతి కూడా ప్రకటించారు ఎవరైనా (501) 450-6120లో కాన్వే పోలీస్ డిపార్ట్మెంట్ (CPD)ని సంప్రదించాలి లేదా అత్యవసర సేవలను సంప్రదించాలని సోషల్మీడియా ద్వారా ప్రకటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement