కళాశాలకు వెళ్తున్నానని చెప్పి.. | 17 years old Girl missing in Jeedimetla | Sakshi
Sakshi News home page

కళాశాలకు వెళ్తున్నానని చెప్పి..

Jul 21 2017 12:46 PM | Updated on Sep 5 2017 4:34 PM

కళాశాలకు వెళ్తున్నానని చెప్పి..

కళాశాలకు వెళ్తున్నానని చెప్పి..

కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌: కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాయి బాబ నగర్‌కు చెందిన ప్రీతి(17) చింతల్‌లోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్‌ ద్వితియ సంవత్సరం చదువుతోంది.
 
ఈ క్రమంలో ఈ నెల 20న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement