AP: అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ పార్టీ.. ఇంజనీరింగ్‌ విద్యార్థులు అరెస్ట్‌ | Engineering Students Arrest In Guntur | Sakshi
Sakshi News home page

AP: అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ పార్టీ.. ఇంజనీరింగ్‌ విద్యార్థులు అరెస్ట్‌

Feb 19 2025 10:07 AM | Updated on Feb 19 2025 10:38 AM

Engineering Students Arrest In Guntur

సాక్షి, గుంటూరు: గుంటూరులో మత్తుమందు సేవిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో 10 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి గుంటూరుకు తీసుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

గుంటూరులో సాయిక్రిష్టనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో మత్తుమందు సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో ఎండీఎంఏ మత్తు మందును సేవిస్తూ, విక్రయిస్తున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులతో సహా డ్రగ్స్‌ ముఠాను అరెస్ట్‌ చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసి 10.67 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి గుంటూరుకు ఇంజనీరింగ్‌ విద్యార్థి సాయిక్రిష్ణ డ్రగ్స్‌ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

దాడుల సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎండీఎం మత్తుమందును ఒక గ్రామును 1400 రూపాయలకు కొనుగోలు చేసి సాయిక్రిష్ట్ర దాన్ని ఐదు వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 11 మంది నిందితులు ఉండగా.. వారిలో ఇద్దరు తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement