పింఛన్‌ దరఖాస్తుదారులకు చుక్కలే! | Elderly and Widows Flock to Secretariats to Apply for New Pensions | Sakshi
Sakshi News home page

పింఛన్‌ దరఖాస్తుదారులకు చుక్కలే!

Sep 8 2026 5:47 AM | Updated on Sep 8 2026 5:47 AM

Elderly and Widows Flock to Secretariats to Apply for New Pensions

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు, వితంతువులు

తొలిరోజు సాంకేతిక ఇబ్బందులు

సర్వర్‌ పనిచేయక సాయంత్రం వరకూ పడిగాపులు

సాక్షి, అమరావతి: రెండేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఎట్టకేలకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకు­నేందుకు సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించగా.. తొలిరోజే సర్వర్‌ మొరా­యిం­చడంతో వృద్ధులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లిన దరఖాస్తుదారులు సాంకేతిక సమస్యల కారణంగా గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది. 

సోమవారం నుంచి ఏడు రోజులు మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా పింఛన్ల దరఖాస్తులు నమోదు చేసు­కోవ­డానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉదయం సచివాలయాలు తెరవక­ముందే వృద్ధులు, వితంతువులు వాటి ఎదుట బారులుతీరారు. ఉద­యం ఆన్‌లైన్‌ పోర్టల్‌ పనిచే­యలేదు. ఉన్నతాధి­కారులు జోక్యం చేసుకుని సర్దు­బాటు చేసిన తర్వాత కూడా అనేకచోట్ల పోర్టల్‌ పనిచేయలేదు. దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవ్వాతా­తలు సాయంత్రం వరకు సచివాలయాల వద్ద వేచిచూడగా.. తగిన పత్రాలు తీసుకురాలేదని సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement