
కోవిడ్తో ఎవరూ మృతిచెందలేదని డీఎంహెచ్వో ప్రకటన
మహారాణిపేట(విశాఖ)/ముసునూరు: కరోనా సోకి విశాఖ నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి (60) గురువారం ఉదయం మృతిచెందినట్లు తెలిసింది. ఆ రోగి కోవిడ్తో మృతిచెందినట్టు అతని కేస్ షీట్లో నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ వ్యక్తి కోవిడ్తో మృతిచెందలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. జిల్లాలో ఇంతవరకు ఏ విధమైన కోవిడ్ మరణం నమోదు కాలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఏలూరు జిల్లాలో కోవిడ్ కేసు నమోదు
ఏలూరు జిల్లా ముసునూరు మండలం యల్లాపురానికి చెందిన ఓ వ్యక్తి (52)కి కరోనా సోకింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాదులో ఓ ఫంక్షన్కు హాజరైన ఆయన ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి వచ్చి అనారోగ్యానికి గురవడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. వైద్యులు కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయగా, పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని హోమ్ ఐసోలేషన్లో ఉంచినట్టు ముసునూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ షకీనా ఇవాంజిలిన్ గురువారం తెలిపారు.