ఇంద్రకీలాద్రిపై పూజలకు అనుమతి | Devotees Are Allowed In Worship On Indrakeeladri | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దుర్గమ్మకు నవ హారతులు

Sep 18 2020 12:40 PM | Updated on Sep 18 2020 1:17 PM

Devotees Are Allowed In Worship On Indrakeeladri - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై పూజలు నిర్వహించడానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. పల్లకి సేవ, పంచ హారతులు, దర్బార్ సేవలో భక్తులను అనుమతించాలని దుర్గ గుడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో పూజల టిక్కెట్లను అధికారులు విడుదల చేయనున్నారు. 

దుర్గమ్మకు నవ హారతులు
పవిత్ర కృష్ణమ్మకు శుక్రవారం నుంచి నవ హారతులు తిరిగి ప్రారంభించేందుకు దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనులలో భాగంగా ఈ  ఏడాది జనవరిలో నవ హారతులను నిలిపివేశారు. ఫ్లై ఓవర్‌ పనులు పూర్తికావడంతో శుక్రవారం నుంచి తిరిగి హారతులను ప్రారంభించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. నవ హారతుల కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారులు పూర్తిచేశారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పంచహారతుల అనంతరం దుర్గాఘాట్‌లో నవ హారతులు ప్రారంభం అవుతాయని ఆలయ ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement