ఆ స్థానంలో విజయరామరాజు నియామకం
మరికొందరు ఐఏఎస్లకూ స్థానచలనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం శుక్రవారం రాత్రి బదిలీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సౌరభ్ గౌర్ను రిలీవ్ చేశారు. కాగా పాఠశాల విద్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టుతో పాటు ఆయుష్ డైరెక్టర్ పోస్టుకు అవసరమైన ఎఫ్ఏసీ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.


