ఏపీలో డెల్టా కేసులే అధికం 

Corona Virus Delta cases are high in Andhra Pradesh - Sakshi

2021 నుంచి రాష్ట్రంలో నాలుగు వేరియంట్‌లుగా కరోనా వ్యాప్తి 

వాటిలో అత్యధికం డెల్టా, దాని ఉపరకం కేసులే.. 

బీఎఫ్‌–7 వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం   

ఇప్పటికే విమానాశ్రయాల్లో స్క్రీనింగ్, వైద్య పరీక్షలు 

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ తాజాగా ఒమిక్రాన్‌ బీఎఫ్‌–7 వేరియంట్‌ రూపంలో వివిధ దేశాల్లో వ్యాపిస్తోంది. మన దేశంలోనూ కొన్ని చోట్ల ఈ వేరియంట్‌ కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ నమోదైన కరోనా వేరియంట్‌లను ఓసారి పరిశీలిస్తే.. డెల్టా, దాని ఉప వేరియంట్‌ కేసులే అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో తొలి కరోనా కేసు 2020 మార్చి 9న నమోదైంది.

ఇలా ఇప్పటి వరకూ 23.39 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్‌లను పసిగట్టడం కోసం పాజిటివ్‌ వ్యక్తుల నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2021 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసులకు సంబంధించిన 11,498 నమూనాల సీక్వెన్సింగ్‌ చేపట్టారు.

ఈ నేపథ్యంలో అల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ల కేసులు నమోదైనట్టు తేలింది. ఈ వేరియంట్‌లలో డెల్టా దాని ఉపరకం కేసులే అత్యధికంగా 6,635 ఉన్నాయి. ఆ తర్వాత ఒమిక్రాన్‌ బీ.1.1.529 వేరియంట్‌ కేసులు 1,669, ఒమిక్రాన్‌ ఉప రకాలకు సంబంధించిన వేరియంట్‌ల కేసులు 1,646 వెలుగు చూశాయి.

అలాగే అల్ఫా వేరియంట్‌ కేసులు 1,097 ఉండగా, బీటా వేరియంట్‌ కేసులు 9 వెలుగు చూశాయి. ఈ రెండు వేరియంట్‌లు కూడా 2021లో మాత్రమే వెలుగు చూశాయి. ఈ ఏడాది వీటికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.   

అవి ఒమిక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించినవి..   
తాజాగా 48 నమూనాలను జీనోమ్‌ ల్యాబ్‌లో పరీక్షించగా.. అన్నీ ఒమిక్రాన్‌కు సంబంధించినవిగా వెల్లడైంది. బీఎఫ్‌–7 వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఇప్పటికే విమానాశ్రయాల్లో స్క్రీనింగ్, వైద్య పరీక్షలు మొదలు పెట్టింది.

అంతర్జాతీయ విమానాల్లోని రెండు శాతం మంది ప్రయాణికుల నుంచి శాంపిళ్లు తీసుకుని పరీక్షిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా తేలితే.. ఆ నమూనాలను తప్పనిసరిగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాల్సిందిగా అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

30-12-2022
Dec 30, 2022, 06:05 IST
బీజింగ్‌: తొలిసారిగా వూహాన్‌లో కరోనా వైరస్‌ ఉద్భవించిన నాటి నుంచి చైనా అంతటా కోవిడ్‌ కరాళనృత్యం కొనసాగేవరకూ ఏ విషయాన్నీ...
30-12-2022
Dec 30, 2022, 04:42 IST
న్యూఢిల్లీ: చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి ఇండియాకు వచ్చే విమానప్రయాణికులు కచ్చితంగా ముందుగా కోవిడ్‌...
29-12-2022
Dec 29, 2022, 05:01 IST
బీజింగ్‌: చైనాలో ఒకవైపు కరోనా కల్లోలం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నా సరిహద్దులను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో కొత్త జోష్‌...
28-12-2022
Dec 28, 2022, 09:54 IST
కరోనా మహమ్మారి మరోసారి చైనాను కబళిస్తోంది. ప్రజాగ్రహానికి లొంగి కఠిన ఆంక్షలు సడలించి నెలైనా కాకముందే దేశంలో కల్లోల పరిస్థితులు...
28-12-2022
Dec 28, 2022, 08:40 IST
బీజింగ్‌: చైనాలో కరోనా నానాటికీ చుక్కలు చూపుతోంది. రోజూ లక్షలాది మంది దాని బారిన పడుతున్నారు. షాంఘై సమీపంలోని పారిశ్రామిక...
27-12-2022
Dec 27, 2022, 04:17 IST
సాక్షి, అమరావతి: చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కరోనా...
27-12-2022
Dec 27, 2022, 03:47 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు కేంద్రంగా గ్రామ స్థాయిలోనే సమర్థంగా కరోనా నివారణ, నియంత్రణ, చికిత్స చర్యలు చేపట్టాలని...
25-12-2022
Dec 25, 2022, 05:37 IST
బీజింగ్‌: చైనాలో కరోనా కల్లోలం నానాటికీ ఉగ్ర రూపు దాలుస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాదిగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రజాందోళనలకు తలొగ్గి...
25-12-2022
Dec 25, 2022, 05:32 IST
గాంధీనగర్‌/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే...
24-12-2022
Dec 24, 2022, 18:39 IST
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను మళ్లీ కోవిడ్‌ భయం వణికిస్తోంది.
24-12-2022
Dec 24, 2022, 11:33 IST
సాక్షి, హైదరాబాద్‌: చైనా తదితర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని ఏఐజీ...
24-12-2022
Dec 24, 2022, 07:57 IST
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్‌...
24-12-2022
Dec 24, 2022, 05:39 IST
న్యూఢిల్లీ: సూదితో అవసరం లేని కోవిడ్‌–19 టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన...
24-12-2022
Dec 24, 2022, 04:48 IST
చైనాలో కరోనా కల్లోలం భారత్‌లోనూ భయభ్రాంతులకు కారణమవుతోంది. దేశంలో నాలుగో వేవ్‌ మొదలైపోతుందని ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌...
23-12-2022
Dec 23, 2022, 09:39 IST
బీజింగ్‌: చైనాలో జీరో కోవిడ్‌ విధానం అకస్మాత్తుగా వెనక్కి తీసుకోవడంతో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌...
23-12-2022
Dec 23, 2022, 04:59 IST
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య...
23-12-2022
Dec 23, 2022, 04:25 IST
సాక్షి, అమరావతి: వివిధ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చర్యలు...
23-12-2022
Dec 23, 2022, 04:20 IST
సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): ఒకవేళ మన రాష్ట్రం­లో కోవిడ్‌ బీఎఫ్‌–7 వేరియంట్‌ ప్రభావం చూపితే.. సమ­ర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతా...
22-12-2022
Dec 22, 2022, 12:24 IST
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి దడ పట్టిస్తోంది. కోవిడ్‌ పుట్టినిల్లుగా భావించే చైనాలో ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్‌ ప్రస్తుతం...
22-12-2022
Dec 22, 2022, 12:07 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న...



 

Read also in:
Back to Top