
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. 28వ తేదీ ఉదయం 8 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి.. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కాలేజ్ హెలీప్యాడ్కు చేరుకుంటారు.
అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేసి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.