బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సీఎం జగన్‌ | CM YS Jagan Review On Electricity Situations | Sakshi
Sakshi News home page

బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సీఎం జగన్‌

Oct 14 2021 6:10 PM | Updated on Oct 15 2021 4:01 AM

CM YS Jagan Review On Electricity Situations - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. థర్మల్‌ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులతో సమీక్షించారు.

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. థర్మల్‌ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులతో సమీక్షించారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడున్నా కొనుగోలు చేయాలన్నారు. బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలన్నారు.

చదవండి: లక్ష్యంలోగా సర్వేను పూర్తి చేయాలి: సీఎం జగన్‌

కృష్ణపట్నం, వీటీపీఎస్‌ల్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాలమేరకు బొగ్గును తెప్పించుకోవాలని సీఎం సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.
చదవండి:
AP: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల్లో ఆలస్యం లేదు: హేమ చంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement