AP: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల్లో ఆలస్యం లేదు: హేమ చంద్రారెడ్డి | Hemachandra Reddy Said No Delay In Payment Of Fee Reimbursement | Sakshi
Sakshi News home page

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల్లో ఆలస్యం లేదు: హేమ చంద్రారెడ్డి

Oct 14 2021 5:47 PM | Updated on Oct 14 2021 6:55 PM

Hemachandra Reddy Said No Delay In Payment Of Fee Reimbursement - Sakshi

నాణ్యమైన విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమ చంద్రారెడ్డి అన్నారు. విద్యారంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు.

సాక్షి, విజయవాడ: నాణ్యమైన విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమ చంద్రారెడ్డి అన్నారు. విద్యారంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల్లో ఆలస్యం లేదని.. 87 శాతం విద్యార్థులకు పూర్తిగా చెల్లింపులు చేశామని స్పష్టం చేశారు.

2019 నుంచి ఇప్పటివరకు 4వేల కోట్లు చెల్లించామని తెలిపారు. రూ.1880 కోట్ల గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నాయని తెలిపారు. అక్రమాలను నిరోధించేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. వివిధ అంశాలపై విజిలెన్స్‌ ఎంక్వైరీ జరుగుతోందన్నారు.
చదవండి:
‘కట్టుకథలు.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’

Advertisement
 
Advertisement
Advertisement