విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారులకు సీఎం అభినందనలు

CM YS Jagan Congratulated Top Executives Of AP Power Companies - Sakshi

ఇటీవల జాతీయ అవార్డులు గెలిచిన ఏపీ విద్యుత్‌ సంస్థలు

సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్‌ సంస్థలు జాతీయస్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నందుకు.. ఆ సంస్థల ఉన్నతాధికారులను సీఎం జగన్‌ అభినం­దించారు. విద్యుత్‌ సమర్థ వినియోగంలో ఏపీ విద్యుత్‌ సంస్థలు ఇటీవల మూడు అవార్డులు గెలుచుకున్నాయి. ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలప్‌­మెంట్‌ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది. దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీగా ఏపీ ట్రాన్స్‌కో ఎంపికైంది. న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ పునరుత్పాదక కార్పొరేషన్‌లలో ఒకటిగా ఎనర్షియా అవార్డును గెలుచుకుంది.

ఈ అవార్డులను సోమవారం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌కు ఇంధన శాఖ ఉన్నతాధికారులు అందించారు. వారిని అభినందించిన సీఎం జగన్‌.. భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు గెల్చుకునేలా కృషి చేయాలని సూచించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజ­యానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీ, ఏపీ వీసీ ఎండీ ఎస్‌.రమణా­రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ(హెచ్‌ఆర్‌డీ) ఐ.పృథ్వితేజ్, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మాజనార్ధన్‌రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ(విజిలెన్స్‌) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు. 

సీఎం జగన్‌కు మంత్రుల శుభాకాంక్షలు
పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం జగన్‌ను కలిసి నూతన సంవత్సర శుభా­కాం­క్షలు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనా­రాయణ, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, జోగి రమేశ్‌తో పాటు ఉన్నతాధికారులు సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:  విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top