సాక్షి,విజయవాడ: మహాటీవీకి చంద్రబాబు ప్రభుత్వం రూ.56.64లక్షలు లబ్ధి పొందేలా నిర్ణయం తీసుకుంది. పబ్లిసిటీ వీడియోలను రూపొందించినందుకు నిధులను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్, దీపం, ఉచిత ఇసుక పథకం వంటి కార్యక్రమాల ప్రచారం కోసం రూ.56.64లక్షల నిధుల్ని కేటాయించారు. తద్వారా చంద్రబాబు తన అనుకూల మీడియాకు భారీగా లబ్ధి చేకూరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


