10, 11 తేదీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందం | Central team to visit Andhra Pradesh on November 10 and 11 to assess Cyclone Montha damage | Sakshi
Sakshi News home page

10, 11 తేదీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందం

Nov 9 2025 5:44 AM | Updated on Nov 9 2025 5:44 AM

Central team to visit Andhra Pradesh on November 10 and 11 to assess Cyclone Montha damage

సాక్షి, అమరావతి: కేంద్ర అధికారుల బృందం ఈ నెల 10, 11 తేదీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పౌసమి బసు నేతృత్వంలో 8 మంది అధికారులు.. రెండు బృందాలుగా విడిపోయి ఆరు జిల్లాల్లో పర్యటించి తుపాను నష్టాన్ని అంచనా వేయనున్నారు. ఈ బృందం 10వ తేదీ ఉదయం తాడే­పల్లి­లోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమావేశమై వివరాలు సేకరించనుంది.

అనంతరం బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఒక బృందం, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో మరో బృందం పర్యటించి పంట, ఇతర నష్టాలను అంచనా వేయనుంది. ఈ బృందాన్ని సమన్వయం చేసేందుకు నోడల్‌ అధికారిగా విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్, రాష్ట్ర స్థాయి లైజనింగ్‌ అధికారిగా ఈడీ వెంకట దీపక్‌ను నియమించింది.

Advertisement
 
Advertisement
Advertisement