సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం మండలంలో ఘోర ప్రమాదం తప్పింది. దొంగపిండి గ్రామం వద్ద వంతెన కూలిపోయింది. ఇసుక లారీ వెళ్తుండగా వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం నుంచి లారీ డ్రైవర్ బయటపడ్డారు. గ్రామానికి ఇదే ఏకైక మార్గం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దొంగపిండి గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


