బీజేపీ రాష్ట్ర పదాధికారుల భేటీ | BJP Andhra Pradesh Leaders Meeting | Sakshi
Sakshi News home page

బీజేపీ రాష్ట్ర పదాధికారుల భేటీ

Jul 10 2022 4:43 AM | Updated on Jul 10 2022 2:42 PM

BJP Andhra Pradesh Leaders Meeting - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతుందని శనివారం ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, పలువురు రాజ్యసభ సభ్యులతో పాటు రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు హాజరవుతారని పేర్కొంది. ఈ నెల 2,3 తేదీల్లో హైదరాబాద్‌ నగరంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు చర్చించనున్నట్లు తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement