తిరుమల మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం | Sakshi
Sakshi News home page

తిరుమల మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం

Published Mon, Aug 14 2023 10:54 AM

Bear Roaming At Tirumala Stairway - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి మెట్ల నడకదారిలో ఎలుగుబండి సంచరించింది. 2వేల మెట్టదగ్గర సోమవారం ఉదయం భక్తులకు ఎలుగుబండి కనిపించింది. కాగా, ఎలుగు బండి సంచారంతో భక్తులు భయాందోళను గురవుతున్నట్టు తెలిపారు. 

మరోవైపు.. ఇటీవల ఓ బాలిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అనంతరం, చిరుతను అధికారులు జూకు తరలించారు. 

ఇది కూడా చదవండి: చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు తెలియాలి: డీఎఫ్‌ఓ శ్రీనివాసులు

Advertisement
Advertisement